తమిళ సినీ నటి ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతని భార్యగా సువర్ణ పాత్రలో నటించింది.
ఇక ఈ సినిమా అంత సక్సెస్ కాకపోగా.ఇందులో సువర్ణ పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్.
ఇదిలా ఉంటే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి 2019లో విడుదలయిన మిస్ మ్యాచ్ సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా ఐశ్వర్య రాజేష్ కు మంచి గుర్తింపును అందించింది.
ఇండస్ట్రీకి పరిచయం కాకముందు యాంకరింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్య.ఆ తర్వాత తమిళ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఎంతోమంది అభిమానుల హృదయాలను సొంతం చేసుకుంది.తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించింది.
ఇక పలు ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.ప్రస్తుతం ‘తిట్టం ఇరండు‘ అనే సినిమాలో నటించింది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో సినీ బృందం ఓ మీడియాతో ముచ్చటించారు.ఇక ఐశ్వర్య రాజేష్ కూడా కొన్ని విషయాలు తెలుపుతూ.
ఇందులో తను పోలీస్ అధికారిగా నటించిందట.తను తెలుగింటి ఆడపడుచునని చిన్నతనంలో తనకు రంభ లా గ్లామరస్ గా నటించాలని ఉండేదట.
ఇక ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రలలో నటించడానికి సిద్ధమేనని తెలిపింది.ఇక ఇందుకు తగిన కారణాలు ఉండాలని అంటుంది.
ఇదిలా ఉంటే తన నటన విషయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కూడా అంతగా ఎదగలేక పోతుంది ఐశ్వర్య రాజేష్.అంతేకాకుండా తను సినిమాల విషయంలో ఆచితూచి గా అన్నట్లు ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించనున్న ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా పుష్ప సినిమాలో కూడా హీరోకి చెల్లెలుగా నటించనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.