తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ ముందుగా కోలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ సక్సెస్ అయ్యింది.ఏకంగా 25 సినిమాల వరకు పూర్తి చేసింది.
అందులో చాలా వరకు ఆమెకి గుర్తింపు తీసుకొచ్చే సినిమాలే కావడం విశేషం.ధనుష్, విక్రమ్, సూర్య లాంటి హీరోలతో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసింది.
ఇక సోలోగా కూడా సక్సెస్ అందుకుంది.కోలీవుడ్ లో సక్సెస్ అయిన చాలా కాలం తర్వాత ఈ భామ మాతృభాష తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
కౌశల్య కృష్ణమూర్తి అనే రీమేక్ సినిమా ద్వారా ఫస్ట్ టైం పలకరించింది.ఈ సినిమా మాతృకలో కూడా ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ చేసింది.
తరువాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా నటించింది.ఈ పాత్రతో తెలుగులో కూడా ఈ భామకి మంచి గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం నానికి జోడీగా టక్ జగదీశ్ సినిమాలో చేస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కి ఊహించని విధంగా అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ని దేవాకట్టా ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇతర కీలక పాత్రలకు రమ్యకృష్ణ, జగపతి బాబులను తీసుకున్నారని బోగట్టా.పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్య, హీరో తండ్రి క్యారెక్టర్ లో జగపతి బాబు కనిపించబోతున్నారు.
ఈ నెల 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.సుమారు నలబై రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్ తో ఈ సినిమా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది.