తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో కూడా ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక తమిళంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ పాత్ర నుంచి ఐశ్వర్య రాజేష్ తప్పుకోవడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో హీరో పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.రానా దగ్గుబాటి నటిస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాకు “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ఖరారు చేసారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఓ సమస్య ఎదురైందని చెప్పవచ్చు.
ముందుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్లు ఎవరు అనే సందిగ్ధంలో ఉన్నటువంటి చిత్ర బృందానికి పవర్ స్టార్ సరసన నిత్య మీనన్ ను ఎంపిక చేయగా.రానా సరసన తమిళ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారు.
ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న తరువాత తన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని.తమిళంలో ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న ఈమె ఇలా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో నటించడానికి ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే కొన్ని రోజుల షూటింగ్ తరువాత ఐశ్వర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఈ క్రమంలోనే ఈ పాత్రలో నటించడం కోసం మలయాళ నటి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే చాలా ఆలస్యంగా అయిన ఐశ్వర్య రాజేష్ తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలుసుకుని ఈ సినిమాని నుంచి వెళ్ళడం కరెక్ట్ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నటువంటి నిత్యమీనన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.