తెలుగమ్మాయి అయిన తమిళ సినిమాలతోనే తెరంగేట్రం చేసిన భామ ఐశ్వర్య రాజేష్.ఒకప్పటి టాలీవుడ్ నటుడు రాజేష్ కూతురుగా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయిన కూడా అతి తక్కువ కాలంలోనే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ అనే గుర్తింపు సొంతం చేసుకుంది.
కెరియర్ ఆరంభంలోనే విక్రమ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశం ఈ భామ తమిళంలో సొంతం చేసుకుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో కీలక పాత్రలు చేయడానికి కూడా రెడీగా ఉండే ఈ భామకి అక్కడ అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి.
తెలుగులో ఆలస్యంగా పరిచయం అయిన ఈ భామ మిస్ మ్యాచ్, కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం నానికి జోడీగా టక్ జగదీశ్ అనే సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాతో టాలీవుడ్ లో బ్రేక్ వస్తుందని ఈ అమ్మడు ఆశిస్తుంది.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అవకాశాల సంగతి ఎలా ఉన్న కోలీవుడ్ లో మాత్రం మంచి అవకాశాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకుపోతుంది.
కబాలి, కాలా చిత్రాలతో కోలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా మారిన పా రంజిత్ నిర్మాతగా మారి సతీష్ అనే దర్శకుడుని పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తుననాడు.లేడీ ఒరియాంటెడ్ మూవీగా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం ఐశ్వర్య రాజేష్ ని ఫైనల్ చేశారు.
దీనిపై చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే కౌసల్య కృష్ణమూర్తి సినిమాని తమిళంలో కూడా ఐశ్వర్య చేసి మెప్పించింది.
మరో సారి ఆ తరహా పాత్రతో తమిళ ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోతుంది.