ఐశ్వర్య రాయ్.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ అందెగత్త ఎందరో మనసులను దోచింది.ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
అలాంటి ఈ అందగత్తే ఆమె అందానికి తగ్గట్టు అమిత బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని 2007లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
పెళ్లి జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య రాయ్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆతర్వాత పాప కోసం దాదాపు చాలా సంవత్సరాలు సినిమాలు ఆపేసింది.
కొన్నేళ్లకు మళ్లీ సినిమాలు తియ్యడం ప్రారంభించింది ఐశ్వర్య రాయ్.గతంలో పాప పుట్టిన తర్వాత ఎంతో లావుగా మారిన ఐశ్వర్య రాయ్ ఆతర్వాత చాలా అంటే చాలా సన్నగా మారిపోయ్ ఎంతో అందంగా మారిపోయింది.
ఇక రీ ఇన్నింగ్స్ తర్వాత కూడా మంచి మంచి సినిమాల్లో నటిస్తూ తన టాలెంట్ ఏంటో చూపిస్తుంది ఐశ్వర్య రాయ్.
అయితే ఇలా అంత బాగా జరుగుతున్న సమయంలో ఐశ్వర్య రాయ్ తన వివాహం గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏంటంటే.2007 లో ఐశ్వర్యా రాయ్ పెళ్లి చేసుకునే సమయంలో ఆమె ఒక చీరకు దాదాపు 75 లక్షల రూపాయిలు పెట్టిందట.ఎందుకంటే ఆ చీర బంగారు దారాలతో డిజైన్ చేయించారట.ఇక ఆ చీరకు తగ్గ డిజైన్ కు నగలను కుడా డిజైన్ చేయించి పెళ్ళిలో ఎంతో ఆకర్షించేలా ఆ చీరను చేశారట.
అప్పట్లో ఒక చీరకు 75 లక్షలు పెట్టిన మొదటి నటి ఈమెనట.ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో.అంత ధర ఎందుకు పెట్టావ్ ఐశ్వర్యా.3 వేల చీర ఉన్నట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.