యంగ్ టాలెంటెడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్.ఈ కుర్ర హీరో ఉమామహేశ్వర సినిమా తర్వాత స్పీడ్ పెంచి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటి వరకు అతని సినిమాలు అంటే పెద్దగా హైప్ ఉండేది కాదు.అయితే లాక్ డౌన్ లో సాలిడ్ హిట్ ఉమామహేశ్వర రూపంలో పడటంతో తన హవా స్టార్ట్ చేశాడు.
ప్రస్తుతం తమన్నాతో గుర్తుందా శీతాకాలం అంటూ రొమాంటిక్ గా పాటలు పాడుకుంటున్నాడు.మరో వైపు బ్లఫ్ మాస్టర్ ఫేమ్ గోపీ గణేష్ దర్శకత్వంలో గాడ్సే అనే సినిమాతో యాక్షన్ నేపధ్యంలో పవర్ ఫుల్ రోల్ లో సందడి చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ కోబ్రా సినిమాలో పోలీస్ ఆఫీసర్ లో మంచి పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు.తాజాగా రిలీజ్ అయినా కోబ్రా టీజర్ లో అతని పాత్రని కూడా బాగా ఎలివేట్ చేశారు.
విక్రమ్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత ఆ స్థాయి పాత్రలో
సత్యదేవ్
కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే గాడ్సే సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.సి కళ్యాణ్ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన చేసింది.
ఇందులో సత్యదేవ్ కి జోడీగా మలయాలే ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది.ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.ఈ అమ్మడుకి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.టైటిల్ తోనే కొంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాతో సత్యదేవ్ ప్రేక్షకులకి ఎంత వరకు కనెక్ట్ అవుతాడనేది చూడాలి.