మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు.ఎనిమిది నెలల క్రితం ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు అదుగో ఇదుగో అంటూ టైమ్ పాస్ చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా వేదాలం మరియు లూసీఫర్ రీమేక్ లను చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆచార్య గురించి కంటే ఇప్పుడు ఆ రెండు రీమేక్స్ గురించే ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోతున్న వేదాళం సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మెహర్ రమేష్ ఈ సినిమాను జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఇక వేదాళం సినిమాలో కీలకమైన హీరో చెల్లి పాత్రను ఎవరు చేస్తున్నారు అనే విషయంలో గత రెండు మూడు వారాలుగా ప్రముఖంగా వార్త కథనాలు వస్తున్నాయి.
మొన్నటి వరకు సాయి పల్లవి ఆ పాత్రకు ఎంపిక అయ్యింది ప్రచారం జరిగింది.చిరంజీవి చెల్లి పాత్రలో సాయి పల్లవి మరీ చిన్నగా ఉంటుందేమో అనే అభిప్రాయాలు వచ్చాయట.
దాంతో కీర్తి సురేష్ తో కూడా చర్చలు జరిపారనే వార్తలు వచ్చాయి.అయితే వరుసగా హీరోయిన్ పాత్రలు చేస్తున్న తాను ఇలా చిరుకు చెల్లి పాత్రలో కనిపిస్తే కెరీర్ లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించిందట.
అందుకే ఆమె కూడా నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలో మరో హీరోయిన్ పేరు ప్రచారం జరుగుతుంది.ఆమె ఐశ్వర్య రాజేష్.తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలో స్టార్ హీరోయిన్.తెలుగులో కూడా పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది.తెలుగులో మరింత బిజీ అయ్యేందుకు వేదాళంలో చెల్లి పాత్రను చేయాలని ఈమె భావిస్తుందట.త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.