భారతదేశంలో దిగ్గజ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.అయితే ఇది కేవలం ఇన్ యాక్టివ్ గా వున్న కస్టమర్స్ మాత్రమే.
వారికి తాజాగా ఎయిర్ టెల్ సంస్థ భారీ ఆఫర్ ను ఇచ్చింది.ఎయిర్ టెల్ లో కొనసాగుతూ ఇన్ యాక్టివ్ గా ఉన్న యూజర్లకు మూడురోజుల కాల సమయం ఇస్తూ వారికి ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ సదుపాయాలతో పాటు 1 జిబి డేటా ను కూడా అందించనుంది.
అయితే ఈ ఆఫర్ పొందాలంటే ఆ యూజర్లు కచ్చితంగా నెలరోజులకు పైగా ఇన్ యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే ఉపయోగించవచ్చు.అయితే అందులో కూడా ఒక కండిషన్ ఉందండోయ్… కేవలం ఎయిర్ ఎయిర్టెల్ సంస్థ సదరు కస్టమర్లకు మెసేజ్ పంపిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
మిగతా వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో అన్న వివరాలు ఇంకా తెలపలేదు.
ఇక ఈ ఆఫర్ విషయానికొస్తే… కేవలం మూడు రోజుల సమయంలో మాత్రమే ఈ ఆఫర్ లను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత కచ్చితంగా ఆ యూజర్ రీఛార్జ్ చేసుకోవాలి.లేకపోతే సదరు యూజర్ ఎయిర్ టెల్ సిమ్ సర్వీసులను నిలిపేస్తారు.
ఒకవేళ మూడు రోజులు గడిచిన తర్వాత సదరు యూజర్ అన్ లిమిటెడ్ ప్యాక్ లను రీఛార్జ్ చేసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ ను అందించబడుతుంది అని తెలిపింది ఎయిర్టెల్ సంస్థ.ఎప్పుడైతే జియో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టిందో మిగతా కంపెనీల పరిస్థితి దారుణంగా మారింది.
అప్పటి నుండి వారి యూజర్స్ ను కాపాడుకోవడానికి వివిధ కంపెనీలు వివిధ రకాలుగా వారి యూజర్స్ కు అనేక ఆఫర్లను ఇస్తున్నారు.