టెలికాం రంగంలో ఐయూసి చార్జీలు విధించినప్పటినుంచి టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు కోల్పోకుండా ఉండడం కోసం కొత్త రకాల ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నారు.ఇందులో ప్రముఖ దిగ్గజ టెలికాంసంస్థ అయినా ఎయిర్టెల్ కొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా 279 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే నాలుగు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తోంది.అంతేగాక ఇందులో వినియోగదారులకు 1.5 జిబి డేటాతో పాటు ఏ నెట్వర్క్ కి అయినా అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలను కూడా ఈ ఆఫర్లో అందిస్తోంది. అంతేగాక షా అకాడమీలో నాలుగు వారాల పాటు ఉచితంగా ఏదైనా కోర్సును నేర్చుకునే నేర్చుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తోంది.
ఎయిర్టెల్ అనుబంధ సంస్థ అయినటువంటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ లో కూడా డా అన్లిమిటెడ్ ఆనందాన్ని పొందవచ్చు.
ఇదే తరహా లోనే 379 రూపాయలతో మరొక ప్లాన్ ని అందుబాటులోకి తెచ్చింది.కాకపోతే ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.మరియు ఈ ప్లాన్ మొత్తానికి కేవలం 6 జీబి డేటా మాత్రమే వస్తుంది.
అయితే ఇప్పటికే వోడాఫోన్ జియో వంటి ప్రముఖ టెలికాం దిగ్గజం సంస్థలు ఇదే తరహాలో ప్లాన్లను ప్రవేశపెట్టినా కానీ ఇన్సూరెన్స్ మరియు షాప్ కాడ అకాడమీ వంటి ఫీచర్లను అందించలేదు దీంతో ఇటు విద్యార్థులు కూడా ఈ ప్లాన్ లు బాగానే ఉపయోగపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.