కెనడాలో మరోసారి తుపాకులు గర్జించాయి.టొరంటోలోని ఎయిర్బీఎన్బీకి చెందిన ఓ అద్దె అపార్ట్మెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా.ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు.
ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురైయ్యాడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్ధితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు.
బాధితులకు సంబంధించిన వివరాలు, సంఘటనకు దారి తీసిన కారణాలపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.
మృతులంతా 22, 20, 19 ఏళ్ల యువకులేనని ఓ అధికారి తెలిపారు.గతేడాది అక్టోబర్ 31న కాలిఫోర్నియాలోని ఒరిండాలో ఒక ఇంట్లో జరుగుతున్న పార్టీలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ మరణించారు.ఈ కాల్పులు జరిగిన ఇల్లు ఎయిర్బీఎన్బీకి చెందినదే కావడం గమనార్హం.
అప్పట్లో దీనిపై స్పందించిన సదరు కంపెనీ అనధికార పార్టీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.తమ కంపెనీకి చెందిన అద్దె గృహాల్లో పార్టీలను నిషేధించడంతో పాటు గెస్ట్ కండక్ట్ను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుుంటామని సంస్థ సీఈవో బ్రియాన్ చెస్కీ తెలిపారు.
.