దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది.ఢిల్లీలో ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది.
గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-AQI) 300 పైనే ఉండడం గమనార్హం.ఆదివారం ఉదయం ఏక్యూఐ 350గా నమోదైంది.
కొన్ని ప్రాంతాల్లో 4 వందలు దాటిపోటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అత్యధికంగా ఆనంద్ విహార్ లొ ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్పూర్ 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖా ఫేజ్-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదైంది.
వాయు ప్రమాణాలు క్షీణిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురువుతున్నారు.శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడం లేదని ప్రజలు వాపోతున్నారు.