టాటా సన్స్కి చెందిన ఎయిర్ ఇండియా సంస్థ అదిరిపోయే నిర్ణయం తీసుకుంది.తన విమానాలు నడిపే పైలట్లను 65 ఏళ్లు వచ్చేంతవరకు సర్వీస్ల్లో ఉంచాలని నిర్ణయించింది.
నిజానికి పైలట్లు 65 సంవత్సరాల వయసు వరకు కొనసాగేందుకు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రస్తుతానికి పైలట్లు 58 సంవత్సరాలకే రిటైరై వెళ్లిపోతున్నారు.
ఎయిర్ ఇండియా పైలట్లు దీనివల్ల చాలా లాస్ అవుతున్నారు.గత నెల 29న ఎయిర్ ఇండియా రిటైర్మెంట్ వారికోసం ఒక నివేదిక రూపొందించినట్లు సమాచారం.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్ షో ఇంటర్నల్ డాక్యుమెంట్స్లో రిటైర్మెంట్ పాలసీ గురించి పేర్కొన్నారు.
ఈ కొత్త పాలసీ ప్రకారం, ఎయిర్ ఇండియా ఎంపిక చేసే పైలట్లను 5 సంవత్సరాల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంచుతుంది.
ఈ కాంట్రాక్టును 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొడిగించవచ్చు.పొడిగించిన కాంట్రాక్టు కోసం రెండేళ్లలో పదవీ విరమణ చేసే పైలట్లను టెస్ట్ చేయడానికి ఎయిర్లైన్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సమాచారం.వీరి సేవలు సంతృప్తికరంగా ఉంటే కొనసాగిస్తారు.65 ఏళ్ళు వచ్చేవరకు వారిని విధుల్లోనే కొనసాగిస్తారు.
ఇకపోతే ఎయిర్ ఇండియాని గతేడాది అక్టోబర్ 8న టాటా సన్స్ బిడ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అనంతరం దీనిని 2022, జనవరి 27న స్వాధీనం చేసుకుంది.ఇప్పుడు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 200 కంటే ఎక్కువ కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.వాటిలో 70% ఇరుకైన విమానాలు అని విమానయాన పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.