కరోనాకు భయపడనందుకు వారికి బహుమానం

చైనా దేశం మొత్తం కరోనా వైరస్‌ భయంతో వణికి పోతుంది.ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా వెనుకంజ వేస్తున్నారు.

 Air India Officials Give The Surprise Gift To Air Hostes-TeluguStop.com

బలవంతంగా పంపించినా కూడా వెళ్లేందుకు సిద్దంగా లేరు.చైనా దేశంలో ఉన్న ఇండియన్స్‌ను కాపాడేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించి 650 మందిని ఇండియాకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.

జంబో విమానంను రెండు సర్వీస్‌లు నడిపించడం ద్వారా చైనాలో ఉన్న వారిని తీసుకు రావడం జరిగింది.అయితే ఆ విమానంలో సర్వీస్‌ అందించేందుకు ఏ ఒక్కరు సాహసం చేయలేదు.

ఎంతో మంది పైలెట్లు చైనా వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు.అలాగే ఎయిర్‌ హెస్టస్‌ కూడా చాలా మంది చైనా వెళ్లమంటే భయంతో వణికి పోయారు.పలువురితో చర్చలు జరిపిన తర్వాత మొత్తం 64 మంది చైనా వెళ్లేందుకు ఒప్పుకున్నారు.అక్కడ నుండి సురక్షితంగా వచ్చిన ఆ విమాన సిబ్బందికి ఇప్పుడు ఎయిర్‌ ఇండియా నజరానా ప్రకటించింది.

అలాగే పలువురు కూడా వారికి బహుమానాలు ఇస్తున్నారు.చైనా వెళ్లి వచ్చిన ఆ 64 మందికి నెల రోజులు సెలవులు ఇచ్చినట్లుగా ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

వారి ఆరోగ్య పరిస్థితి విసయమై సెలవులు ఇచ్చారా లేదంటే వారు చేసిన మంచి పనికి సెలవులు ఇచ్చారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube