ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది అన్న విషయం తెలిసిందే.భారీ మొత్తంలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యాసంస్థల పునః ప్రారంభానికి నోచుకోవడంలేదు.
ఇక ప్రస్తుతం భారతదేశంలో అన్లాక్ 2 కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో విద్యాసంస్థలు పునః ప్రారంభించేందుకు కసరత్తులు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే సెప్టెంబర్ 15 నుండి నూతన ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ తదితర అభివృద్ధి సాంకేతిక విద్యా సంస్థల నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.
అయితే ఆగస్టు 30 లోగా మొదటి దశ సెప్టెంబర్ 10 లోగా రెండో దశ కౌన్సెలింగ్ పూర్తి చేసి… మిగిలి ఉన్న అన్ని సీట్లను కూడా 15లోగా పూర్తయ్యేలా చూడాలంటూ పేర్కొంది.
కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించేందుకు నిర్వహించగా.
ప్రస్తుత విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు బోధించడం మొదలుపెట్టాలని అనుబంధ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విద్యా సంస్థలను మూసి వేయగా తమ చదువులు ఏమవుతాయో అనే ఆందోళనలో ఉన్న విద్యార్ధులందరికీ ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.