తెలంగాణా పీసీసీ ఎన్నికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకి నోటు మాదిరిగా నోటుకి పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన అన్నారు.
టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీ గా మారిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.పీసీసీని ఇంచార్జి అమ్ముకున్నారని.
త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని కోమటిరెడ్డి అన్నారు.టీపీసీసీలో కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కోమటిరెడ్డి కామెంట్స్ పై అధిష్టానం సీరియస్ గా ఉంది.
పీసీసీ పోస్ట్ అమ్ముకున్నారంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ సీరియస్ గా తీసుకుంది.
కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ పంపించాలని ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ కమిటీకి ఏఐసీసీ ఆదేశించింది.కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన వీడియోలను అధిష్టానం కు పంపించారు మహేశ్వర రెడ్డి.
ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికపై నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి.లేటెస్ట్ గా పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖని సోనియా గాంధీకి పంపించారు.అయితే ఆయన పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు.