కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్‌పై అధిష్టానం సీరియస్..!

తెలంగాణా పీసీసీ ఎన్నికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకి నోటు మాదిరిగా నోటుకి పీసీసీ ఎన్నిక జరిగిందని ఆయన అన్నారు.

 Aicc Serious On Komatireddy Venkat Reddy, Aicc, Congress Party, Komatireddy Venk-TeluguStop.com

టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీ గా మారిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.పీసీసీని ఇంచార్జి అమ్ముకున్నారని.

త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని కోమటిరెడ్డి అన్నారు.టీపీసీసీలో కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే కోమటిరెడ్డి కామెంట్స్ పై అధిష్టానం సీరియస్ గా ఉంది.

పీసీసీ పోస్ట్ అమ్ముకున్నారంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ సీరియస్ గా తీసుకుంది.

కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ పంపించాలని ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ కమిటీకి ఏఐసీసీ ఆదేశించింది.కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన వీడియోలను అధిష్టానం కు పంపించారు మహేశ్వర రెడ్డి.

ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికపై నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి.లేటెస్ట్ గా పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖని సోనియా గాంధీకి పంపించారు.అయితే ఆయన పార్టీకి మాత్రం రాజీనామా చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube