రూపాయి వస్తువుకు రెండు రూపాయల భద్రత అన్నట్లుగా ఉంది అహ్మదాబాద్కు చెందిన ఒక కారు యజమాని పరిస్థితి.ఆయన దాదాపు కోటి రూపాయలు పెట్టి ఒక కారును కొనుగోలు చేయడం జరిగింది.
అయితే ఆ కారుకు రిజిస్ట్రేషన్ లేదు ఏ ఇతర డాక్యుమెంట్స్ లేవు.అయినా కూడా రోడ్ల మీద రయ్ రయ్ అంటూ చక్కర్లు కొడుతున్నాడు.
చాలా రోజులుగా అతడు ఆ కారులో ప్రయాణిస్తున్నాడు.కాని పోలీసులు గతంలో ఎప్పుడు పట్టుకోలేదు.
మొదటిసారి మొన్న అహ్మదాబాద్లో పోలీసుల జనరల్ చెకింగ్లో అతడి కారును ఆపారు.
పోలీసులు చూపించమన్న డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి కూడా అతడి వద్ద లేదు.
పోర్షే కంపెనీకి చెందిన ఆ కారు ఇండియన్ మార్కెట్లోకి రావాలంటే సవాలక్ష ట్యాక్స్లు కట్టి తీసుకు రావాల్సి ఉంటుంది.కాని అతడు మాత్రం అడ్డదారిన దాన్ని తీసుకు వచ్చాడని, అందుకే దానికి రిజిస్ట్రేషన్ కాని ఏ ఇతర డాక్యుమెంట్స్ కాని లేవని పోలీసులు గుర్తించారు.
అందుకే ఆ కారుకు మొదట 10 లక్షల రూపాయల చలానా విధిస్తూ నోటీసు ఇచ్చారు.ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఆ ఫైన్ను మరింత పెంచారు.
ఆ కారుకు ఉండాల్సిన ఏ ఒక్క డాక్యుమెంట్ లేని కారణంగా ఏకంగా 30 లక్షల రూపాయల ఫైన్ను విధిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించాడు.ఆ కారును ఇప్పుడు పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.ఎప్పుడైతే ఆ ఫైన్ను అతడు చెల్లిస్తాడో అప్పుడు ఆ కారును విడుదల చేయడం జరుగుతుంది.ఒక వేళ కారు బయటకు వచ్చినా కూడా వెంటనే ఆ యజమాని డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకు మళ్లీ పాతిక ముప్పై లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో ఆ కారు యజమాని ఏం చేస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇండియాలో ఒక కారుకు లేదా ఏదైనా వెయికిల్కు ఇంత భారీ మొత్తంలో ఫైన్ పడటం ఇతే ప్రథమం.దాంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.