వచ్చే యేడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ లో మరో కొత్త జుట్టు రాబోతున్నట్టు సామాజిక వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం నడుస్తోంది.అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొత్తగా రానున్నట్లు సమాచారం అందుతోంది.
ఇందుకు సంబంధించి బడా కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా అందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.అదే సమయంలో ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమేనని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఏ కమిటీ కూడా వ్యాఖ్యలు చేయలేదు.ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్ కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదు నెలల ఆలస్యంతో మొదలైంది.
2021 ఐపీఎల్ సీజన్ సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరోసారి ఐపీఎల్ జరగాల్సి ఉంది.అంతేకాదు వచ్చే సంవత్సరం భారత్ లో టి20 ప్రపంచ కప్ కూడా జరగాల్సి ఉంది.
ఇందుకోసం బిసిసిఐ అలాగే ఐపీఎల్ పాలకమండలి దృష్టి పెట్టింది.ఇందులో భాగంగానే వచ్చే ఐపీఎల్ లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్ల తో పాటు మరో జుట్టును కూడా ఆడించాలని ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం.
ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ సీజన్ కొరకు మెగా వేలం నిర్వహించేందుకు కూడా ఐపీఎల్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.దీనికోసం రెండు నెలల్లో జరగబోయే వేలానికి అందరూ సిద్ధంగా ఉండాలని బీసీసీఐ సమాచారం ఇచ్చిందని, అలాగే బిసిసిఐ కూడా ఏలాంటి సమాచారం ఇవ్వకపోయినా మరో జట్టు చేరే అవకాశం ఉన్నట్లు ఒక ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు.అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం బయటికి వెల్లడించలేదు.ఇకపోతే ఈ విషయం ఊహాగానం అంటూ కొట్టి పడేసే అవకాశం కూడా లేదు.చూడాలి మరి వచ్చే సంవత్సరం మరో జట్టు చెబుతుందో లేదో.