కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి.అప్పుడప్పుడు సినిమాలలో చూసినవి నిజంగా జరిగినపుడు ఇలా కూడా మనుషులు ఉంటారా అనిపిస్తుంది.
ఓ తెలుగు సినిమాలో భర్త వేరొక యువకుడిని తన భార్యని లైన్ లో పెట్టాలని సలహా ఇస్తాడు.సైకో లక్షణాలు ఉన్న భర్త భార్యని పరీక్షించడానికి ఇలాంటి పని చేస్తాడు.
భార్య ఆ యువకుడుకి దగ్గరైపోయిన తర్వాత తన అసలు విలనిజాన్ని చూపిస్తాడు.ఇక కమల్ హాసన్ మన్మధభాణం అనే సినిమాలో కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినా అమ్మాయి ఎలాంటిది తెలుసుకోవడానికి మాధవన్ కమల్ హాసన్ ని డిటెక్టివ్ గా పెడతాడు.
అనుకోకుండా హీరోయిన్ కమల్ హాసన్ కి పడిపోతుంది.ఇలాంటి సంఘటనలు సినిమాలో బాగున్నా బయట మాత్రం చాలా ప్రమాదాలకు దారితీస్తాయి.
ఇప్పుడు అలాగే జరిగింది.ఇంచుమించు ఇలాగే జరిగిన సంఘటన కారణంగా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అహ్మదాబాద్ గోమతిపూర్కు చెందిన నిఖిల్ పర్మార్ అనే యువకుడు వాస్నాలోని వెడ్డింగ్ డెకరేషన్ స్లపయింగ్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు.అక్కడ ఏమైందో ఉద్యోగం మానేయడానికి సిద్ధమయ్యాడు.తన కంటే 20 ఏళ్లు చిన్నదైన భార్యతో సంబంధం పెట్టుకోవాలని యజమాని నిఖిల్ను ప్రోత్సహించాడు.అతని మాట ప్రకారం యజమాని భార్యని లైన్ లో పెట్టి వివాహేతర సంబంధం కూడా నిఖిల్ కొనసాగించాడు.
తర్వాత అతని యజమాని తన భార్యతో సంబంధం మానుకోమని చెప్పాడు.ఈ విషయాన్ని నిఖిల్ తన యజమాని భార్యతో చెబితే ఆమె దానికి అంగీకరించకుండా బెదిరించి తనతో సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చింది.
అయితే తన భార్యకు దూరంగా ఉండాలని యజమాని హెచ్చరించాడు.వారి మధ్య మానసికంగా నలిగిపోయిన నిఖిల్ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వ్యవహారం అంతా నిఖిల్ ఫోన్ పరిశీలించే క్రమంలో అతని మెసేజ్ ల ద్వారా తెలిసింది.ఈ ఆధారాలతో పోలీసులు నిందితుల మీద కేసు నమోదు చేశారు.