అల్లు అరవింద్ ఆహా ఓటీటీని ప్రారంభించి ఆరు నెలలకు పైగానే అయ్యింది.అయితే ఇప్పటి వరకు కంటెంట్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టినట్లుగా అనిపించలేదు.
ఇతర ఓటీటీలు వెబ్ సిరీస్లు మరియు కొత్త సినిమాలు భారీ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంటే ఆహా మాత్రం పాత సినిమాలు మూడు నాలుగు బి గ్రేడ్ వెబ్ సిరీస్లను మాత్రమే ఈ ఆరు నెలలుగా స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది.ఎట్టకేలకు ఆహా స్పీడ్ పెంచారు.
ప్రస్తుతం పదికి పైగా వెబ్ సిరీస్లను తెరకెక్కిస్తున్నారు.ఇతరులు నిర్మిస్తున్న కొన్ని వెబ్ సిరీస్ల హక్కులను కూడా ఇప్పటికే కొనుగోలు చేశారు. కొత్త సినిమాలను కూడా కొనుగోలు చేస్తున్నారు.అయితే భారీ సినిమాలపై దృష్టి పెట్టకుండా చిన్న సినిమాలను కంటెంట్ ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నారు.కృష్ణ అండ్ ఇజ్ లీలా మరియు భానుమతి రామకృష్ణ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.తాజాగా 36 వయసు అనే కొత్త సినిమా కూడా వచ్చింది.
ఇలా వచ్చిన ప్రతి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.దాంతో మరిన్ని సినిమాలను కూడా విడుదల చేయాలని ఆహా టీం ప్రయత్నాలు చేస్తోంది.
జోహార్ తో పాటు వచ్చే నెల మొదటి వారంలో పలు సినిమాల స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారట.
వెబ్ సిరీస్లు మరియు సినిమాలు మాత్రమే కాకుండా తమన్నాతో ఒక టాక్ షోను కూడా షూట్ చేశారు.ఆ టాక్ షోను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు.స్టార్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆహాకు ఆ టాక్ షో కూడా మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఆహా నుండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఇకపై అందుకోబోతున్నారు.