లాక్ డౌన్, కరోనా కారణంగా సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమా నిర్మాతలు అందరూ ఒటీటీని ఆశ్రయిస్తున్నారు.డిజిటల్ ప్లాట్ ఫాంలో తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ బాటలో చాలా సినిమాలు అన్ని భాషల నుంచి వచ్చేశాయి.హిందీ సినిమాలు కూడా ఒటీటీ ద్వారా రిలీజ్ అయిపోతున్నాయి.
ఇక తెలుగులో ఇప్పటికే రెండు చిన్న సినిమాలు ఒటీటీలో రిలీజ్ కాగా ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన లవ్ స్టొరీ భానుమతి రామకృష్ణ కూడా ఒటీటీలో రిలీజ్ కి రెడీ అయిపొయింది.
నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్నా ఈ సినిమాతో శ్రీకాంత్ నగోటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని రిలీజ్ కి రెడీ అయిపోయిన ఈ సినిమా సెన్సార్ కూడా అయిపొయింది.ఈ నేపధ్యంలో థియేటర్స్ లేకపోవడంతో నిర్మాత శరత్ మురార్ ఒటీటీకి వెళ్ళిపోయారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ఆహ యాప్ నుంచి అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడు.ఇక సినిమా కంటెంట్ బాగుండటంతో దీనికి అల్లు అరవింద్ ఏకంగా కోటిన్నర చెల్లించినట్లు తెలుస్తుంది.
అయితే శరత్ మురార్ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కావడంతో మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి.ఈ కారణంగా ఈ సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో చెల్లించినట్లు చెప్పుకుంటున్నారు.