కొన్ని ఎండ్లుగా సినిమాకు పోటీగా ఏది లేదు.కానీ ప్రస్తుతం ట్రెండ్ మారుతుంది.
వెబ్ సిరీస్ హవా నడుస్తుంది.సినిమా అవకాశాలకోసం ఎదురుచూసే ఎంతో మంది నటి నటులకు వెబ్ సిరీస్ రూపంలో అవకాశాలు వస్తున్నాయి.
ఎంతో మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇదే కోవాలకి అమలా పాల్ చేరింది.“బెజవాడ” సినిమాతో తెలుగు ఇండస్ష్ట్రికి పరిచయం అయిన అమలా పాల్ ఇక్కడి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో తన సొంత గూడు అయిన తమిళం, మలయాళం లోకి వెళ్ళి అక్కడ రానిస్తుంది.
ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లో నటిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన “లస్ట్ స్టోరీస్” వెబ్ సిరీస్ మంచి విజయం సాదించడంతో ఆ వెబ్ సిరీస్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
అక్కడ కీయరా అద్వానీ నటించిన పాత్రలో ఇక్కడ అమలా పాల్ నటిస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆమె ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.దానికి “కుడి ఎడమైతే” అనే టైటిల్ ను పెట్టినట్లుగా సమాచారం.సమంత ప్రధాన పాత్రలో నటించిన యు టర్న్ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది.
ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది.మొత్తంగా ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా ఉంటుందని తెలుస్తుంది.2021 లో ఆహా లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వుతుంది.అమలా పాల్ తన లేటెస్ట్ హాట్ హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో నిరంతరం సందడి చేస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ఫోటోలు వైరల్ అవ్వుతున్నాయి.