అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏవో కారణాల వల్ల ఎక్కువ మంది జనాలకు రీచ్ అవ్వలేక పోతుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ జనాలకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉపయోగపడేది కంటెంట్.
మంచి కంటెంట్ ఉంటేనే జనాలు ఓటీటీ పై సినిమాలు అయినా వెబ్ సిరీస్లు అయినా చూసేందుకు వస్తారు.అయితే ఆహాలో ఉన్న కంటెంట్ కొందరికి మాత్రమే అవ్వడం వల్ల కూడా దాన్ని జనాలు పక్కకు పెట్టారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆహాలో ఉన్న వెబ్ సిరీస్లు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ను కలిగి ఉంది.కొన్ని సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయి.ఆ కారణంగానే చాలా మంది ఆహా ను దూరం పెట్టారు.పిల్లలకు ఆహా అస్సలు పని చేయదు అంటున్నారు.
ఇలాంటి సమయంలో ఆహాను అందరికి చేరువ చేసేందుకు ఇకపై బూతు కంటెంట్ను పూర్తిగా తొలగించాలనే నిర్ణయానికి వచ్చారట.
అల్లు అరవింద్ ఇటీవల ఆహా కోసం భారీ ఎత్తున వెబ్ సిరీస్లు మరియు వెబ్ సినిమాలు తీయిస్తున్నాడు.అందుకోసం పది మంది టీంను ఏర్పాటు చేశాడు.వారు అడల్ట్ కంటెంట్ అంటూ దర్శకులను దూరం పెడుతున్నారట.
అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కంటెంట్కు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి ఇప్పటికి అయినా ఆహాను ఓహో అనుకుంటూ జనాలు చూస్తారా లేదా చూడాలి.