కేంద్ర ప్రభుత్వం రైతులకు మంచి అవకాశాన్ని ఇచ్చింది.అగ్రి హ్యాకథన్ అనే పేరుతో రూ.
లక్ష సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.నిజానికి రైతులకు ఇది మంచి అవకాశం.
అగ్రి హ్యాకథన్హ్యా కథన్ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని విడుదల చేసింది.ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
దీనిని అగ్రి హ్యాకథన్ 2020 అనే పేరుతో ప్రకటించారు.కాగా ఈ కార్యక్రమం రెండు నెలలపాటు జరుగుతుందని తెలిపారు.
రైతులకు సంబంధించిన విషయంలో ‘ఇండియన్ అగ్రికల్చర్’ అనే భాగంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.ఇందులో రైతులు పాల్గొనగా.మిగతా వాళ్ళు కూడా అవకాశం వినియోగించాలని తెలిపింది.ఇందులో వ్యవసాయ పద్ధతిలో వచ్చే సమస్యలను వారి కొత్త ఉత్పత్తులతో మార్గం చూపించాలంటూ తెలిపింది.
అంతేకాకుండా రైతులకు సంబంధించిన విషయంలో వాళ్ల అవసరాలు కూడా తయారు చేయవచ్చని తెలిపింది.
అంతే కాకుండా ఇందులో యువత కూడా పాల్గొనవచ్చని తెలిపింది.స్టార్ట్ ప్స్, స్మార్ట్ ఇన్నోవేటర్స్ ఇలా ప్రతి ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు MYGOV.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.
కాగా ఈ అవకాశం ఈ నెల 20న ముగుస్తుందని తెలిపారు.ఇందులో పాల్గొన్న వాళ్లకు మూడు రౌండ్లు ఉంటాయి.
కాగా మూడు రౌండ్ల లకు ఎలిమినేషన్ అయ్యి చివరిలో మిగిలిన 24 మందికి రూ.లక్ష అందజేస్తామని తెలిపారు.అంతే కాకుండా మరేమైనా వసతులు తయారుచేయడానికి ఆర్థికంగా మద్దతు ఇస్తామని తెలిపారు.ఇందులో పాల్గొన్న వాళ్లకు వాళ్ల ఆలోచనలతో అగ్రికల్చర్, గ్రీన్ ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్, ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన మరిన్ని విషయాలపై ఏవైనా కొత్త పద్ధతిలో తెలుపవచ్చని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలతో అందించింది.