అనాదిగా ఆడవాళ్లను బానిసలుగా చూస్తూనే ఉంది ఈ లోకం.టెక్నాలజీలో ఊహించలేని అభివృద్ధి, రోదసిలోకి రాకెట్లు పంపేంత ఘనత, చంద్ర మండలంలో ఇళ్లు నిర్మించుకునే స్దాయికి చేరిన మనుషులు తమ తెలివిని రాకెట్ కంటే వేగంగా వృద్ధి చేసుకుంటున్నారు కానీ మనుషులను సాటి మనుషులుగా గుర్తించని వీరు యంత్రాలుగా మిగిలిపోతున్నారు.
మన సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాలను రూపుమాడంలో ఇంకా వెనకబడే ఉన్నారు.
మధ్యప్రదేశ్లో అమల్లో ఉన్న దడీచ ప్రథ అనే ఆచారం, ఈ అరాచకాన్ని వేలెత్తి చూపుతుంది.
ఇకపోతే మధ్యప్రదేశ్లో రాజ్పుట్లు ఎక్కువగా నివాసముండే పాత గ్వాలియర్ రాజసంస్థానం పరిధిలోని శివపురి జిల్లాలో ఓ ఆటవిక ఆచారం రాజ్యమేలుతోందట.ఇక్కడ నివసించే పేదోళ్ల భార్యలను డబ్బున్నోళ్లు అద్దెకు తీసుకునే అమానుష ఆచారం అమలవుతోందట.
కట్టుకున్న భర్తలే పది రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ రేటు కట్టి మరీ బడాబాబులకు తమ భార్యలను అద్దెకు అప్పగిస్తారట.ఆమె వయసు అందంపై ఆ రేటు ఆధారపడి ఉంటుందని, నెల రోజులకొక ధర, సంవత్సారానికైతే మరో రేటు చొప్పున నిర్ణయిస్తారట.
అదీగాక అద్దెకు తీసుకుంటున్నట్లు రాతపూర్వక అగ్రిమెంట్ కూడా రాసుకోవడం విశేషం.
ఈ దురాచారం ఒక్క మధ్యప్రదేశ్లోని శివపురిలోనే కాదు.
గుజరాత్లోని వెనకబడిన ప్రాంతంలోనూ ఉందని తెలుస్తోంది.ఇకపోతే అద్దెకు తీసుకున్న వ్యక్తికి పడక సుఖంతో పాటు ఇంటి పనులు కూడా చేయాల్సి ఉంటుందట.
చీ ఇందెంత దురాచారం.ఒక స్త్రీని అంగట్లో బొమ్మలా అమ్మడం అని అంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.