తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే “అగ్నిసాక్షి” సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన కన్నడ సీరియల్ హీరోయిన్ “ఐశ్వర్య పిస్సే” గురించి బుల్లి తెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ఐశ్వర్య కి సోషల్ మీడియా మధ్యన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకి బాగానే పెరుగుతోంది.
దీనికితోడు ఐశ్వర్య కూడా అప్పుడప్పుడూ తన అందమైన ఫోటోలు మరియు వీడియో రీల్స్ చేస్తూ ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.
అయితే నటి ఐశ్వర్య కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది.
దీంతో తన చదువులన్నీ పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది .ఈ క్రమంలో కన్నడ భాషలో ప్రసారమయ్యే “సర్వ మంగళ మాంగళ్య” అనే ధారావాహికలో నటించే అవకాశం దక్కించుకుంది.ఆ తర్వాత మా టీవీలో ప్రసారమయ్యే అగ్ని సాక్షి సీరియల్ లో అవకాశం రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.
అయితే ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకి తెలుగు భాష మాట్లాడటం స్పష్టంగా రాదని దాంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నానని తెలిపింది.ఆ తర్వాత మెల్లమెల్లగా తెలుగు భాషని చదవటం, రాయటం, నేర్చుకున్నానని దాంతో ప్రస్తుతం తనకు డబ్బింగ్ విషయంలో ఎలాంటి సమస్య లేదని చెప్పుకొచ్చింది.అంతేగాక తెలుగు, కన్నడ భాషలు మాట్లాడటానికి ఒకేలా ఉంటాయని అందువల్లనే తొందరగా తెలుగు నేర్చుకున్నానని కూడా తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి ఐశ్వర్య తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే “నా పేరు మీనాక్షి” సీరియల్ హీరోయిన్ గా నటించిన నవ్య స్వామి సొంత అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కాగా ప్రస్తుతం ఐశ్వర్య తన భర్తతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నట్లు సమాచారం.