తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన అంచనాలకు తగ్గట్టుగానే దూసుకుపోతోంది.ఈ చిత్రంలో మహేష్బాబు సరసన రష్మిక మందన్న నటించగా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి, హరితేజ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రావు రమేష్, సీనియర్ నటి సంగీత, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఇప్పటికే మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మరియు ఎంటర్టైనర్గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ చిత్రం మొదటి రోజునే దాదాపుగా 25 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది.దీంతో మహేష్ బాబు గతంలో తాను నటించినటువంటి మహర్షి చిత్ర రికార్డుని బ్రేక్ చేసుకున్నాడు.
అంతేగాక ఇప్పటికే టాలీవుడ్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో సరిలేరు నీకెవ్వరు నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.మొదటి మూడు స్థానాల్లో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి ఇ బాహుబలి 2, ప్రభాస్ నటించినటువంటి సాహో, మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సైరా నరసింహారెడ్డి చిత్రాలు ఉన్నాయి.అయితే నాలుగో స్థానంలో జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అజ్ఞాతివాసి చిత్రాన్ని వెనక్కి నెట్టేసి సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.