శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.కార్యాలయం ఎదుట బాతువా రజకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
తమను గ్రామ బహిష్కరణ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అగ్ర కులానికి చెందిన వారు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.అయితే, గతంలో దుస్తులు ఉతికేందుకు డబ్బులు పెంచాలని రజకులు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే మాట వినలేదన్న అక్కసుతో గ్రామ బహిష్కరణ చేస్తూ దండోరా వేయించారని వాపోతున్నారు.నిత్యావసరాలు సైతం తమకు అమ్మకుండా అడ్డుకుంటున్నారని రజకులు ఆరోపిస్తున్నారు.