ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసిపి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాస్తున్న లేటర్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అదే రీతిలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి.
ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ రఘురామకృష్ణంరాజు రాస్తున్న లేటర్లు మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా సీఎం జగన్ కి నవ సూచనలు (విధేయతతో) అనే హెడ్డింగ్ పెట్టి లెటర్ రాయడం జరిగింది.
దాదాపు 41 వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని.ఇటీవల ప్రతిపక్షాలు అదేరీతిలో కొన్ని మీడియా ఛానల్స్ ఆరోపణలు చేస్తూ ఉండటంతో.ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వివరణ ఇస్తే బాగుంటుందని, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని సూచిస్తూ రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.ఈ లెటర్ లో ఆర్థిక శాఖ బిల్లులు ఆడిట్ అంశాన్ని కూడా రాసుకు రావడం జరిగింది.
నిబంధనలకు విరుద్ధంగా.ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసినట్లు.
బదిలీ చేసినట్లు రఘురామకృష్ణంరాజు లెటర్ లో ఆరోపణలు గుప్పించారు.లెక్క లేకుండా ఖర్చు పెట్టిన.
నిధుల గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ రఘురామకృష్ణంరాజు లెటర్లో స్పష్టం చేశారు.