టాలీవుడ్లో ఆకట్టుకునే కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ చూపిస్తారు.ఈ విషయంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు.
ఈ క్రమంలో అనేక చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అందులో ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల సంఖ్య కూడా చాలానే ఉన్నాయి.కాగా ఈ జాబితాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
పోస్టర్స్తోనే ఆకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రేక్షకులను మెప్పించడంలో తనదైన మార్క్ వేసుకంది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి తన కెరీర్ను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు.అయితే ఈ సినిమాను ఎప్పటినుండో ఇతర భాషల్లో రీమేక్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యినట్లు తెలుస్తోంది.ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం కావడం, యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా బాలీవుడ్ జనాలను ఆకట్టుకోవడంలోనూ సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఈ సినిమాను తెరకెక్కించిన తెలుగు దర్శకనిర్మాతలు బాలీవుడ్లో పనిచేస్తారా లేక వేరే వారు ఈ సినిమాను అక్కడ రీమేక్ చేస్తారా అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది.ఏదేమైనా భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా రీమేక్ అవుతుండటంతో తెలుగు దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.