ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ టూర్ కి రెడీ అవుతున్నారు సీఎం వైఎస్ జగన్.ఈ పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీకి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు, ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఆయన జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.ఈ భేటీలో హైకోర్టు తరలింపు తోపాటు పోలవరం పెండింగ్ నిధులు అదేవిధంగా రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడుల వెనకాల అసలు కారణాలు ఆయన దృష్టికి జగన్ తీసుకెళ్ళ బోతున్నరట.
ఇదిలా ఉంటే ఆలయాల ఘటన విషయంలో ప్రతిపక్ష పార్టీలు బిజెపి అదేవిధంగా టిడిపి పార్టీలు రెండు వైసీపీ ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జగన్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉంటే రామతీర్థం ఘటనలకు సంబంధించి సీఐడీ చేసిన విచారణ నివేదిక అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడానికి జగన్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఆలయాల ఘటనలపై జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించడం జరిగింది.ఇలాంటి తరుణంలో ఢిల్లీ టూర్ జగన్ చేపట్టడం కేంద్ర హోం మంత్రి తో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
.