ఏపీ రాజకీయాల్లో మళ్లీ బూతులు, విమర్శలు.యథాతథంగా మారుతున్నాయా ? దీంతో పొలిటికల్ సెగ మరింత పెరిగిందా ? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.నువ్వు రెండంటే.నే నాలుగంటా.అనడం రాజకీయాల్లో కామనే అయినా.
ఇవి హద్దు మీరడమే ఇప్పుడు వివాదంగా మారిపోయింది.నిజానికి ఎన్నికలకు ముందు నాయకులు ఒకరిపై ఒకరు దురుసు వ్యాఖ్యలు చేసుకోవడం.
నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం తెలిసిందే.కానీ, ఇప్పుడు ఏపీలో ఎక్కడా ఎన్నికలు లేవు.
అయినా కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య ఈ తరహా వ్యాఖ్యలు దూసుకురావడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
.సీఎం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం.
వాటిని వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంతే వేగంగా.అంతే తీవ్రంగా తిప్పికొట్టడంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే.
భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.వాస్తవానికి ఇటీవల కాలంలో లోకేష్ కొంత సంయమనం పాటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఆయన ఏం మాట్లాడినా.ఆచి తూచి మాట్లాడుతుండడంతో అందరూ లోకేష్లో మార్పు వచ్చిందని.
ఇక, టీడీపీలో వచ్చే రెండేళ్లలో పుంజుకోవడం ఖాయమని అనుకున్నారు.
అయితే, అనూహ్యంగా తాజాగా లోకేష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
నేరుగా ఆయన సీఎం జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ కామెంట్లు చెలరేగాయి.`అన్నదాతను అవమానిస్తే.
జగన్ను గోచీతో నిలబెడతారు“ అని లోకేష్ వ్యాఖ్యానించారు.నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసే స్థాయి ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.
ఇలాంటి వ్యాఖ్యలు ఒక సీఎంను ఉద్దేశించేచేయడాన్నిటీడీపీ సమర్ధించు కున్నా.ఎదుగుతున్న క్రమంలో లోకేష్కు ఇలాంటివి మంచివి కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.
ఇక, ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు కౌంటర్లు ఇద్దామా? అని ఎదురు చూసే.వైసీపీ నేతలకు అందివచ్చిన వరంగా మారిపోయింది.
దీంతో మంత్రి అనిల్ కుమార్ రెచ్చిపోయారు.టీడీపీకి ప్రజలు ఎప్పుడో గోచీ పెట్టారన్న ఆయన లోకేష్కు అది కూడా లేకుండా తీసేశారంటూ.
దూకుడు కామెంట్లు చేశారు.ఫలితంగా ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయి? అనే ప్రశ్న మరోసారి తెరమీదికి వచ్చింది.