యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమాల్ని పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం సలార్.త్వరలోనే ప్రభాస్ పుట్టినరోజు రాబోతుండటంతో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కు సంబంధించిన లుక్ కాని టీజర్ కానీ విడుదల చేస్తారని అభిమానులు భావించారు.
కానీ అంతకంటే ముందుగానే లీకేజీ వీరులు లొకేషన్ లో చిత్రీకరించిన వీడియోను లిఫ్ట్ చేసి నిర్మాతలకు షాక్ ఇచ్చాడు.సలార్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ అవుతూనే ఉన్నాయి.
ఇక్కడ ఈ లీకేజీని ఎలా ఆపాలో తెలియక మూవీమేకర్స్ తలలు పట్టుకుంటున్నారు.ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి దీక్షిత్ కనిపించనుంది.
ఇందులో శృతిహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పటికీ ఆమె పాత్రకు ఇలాంటి ప్రధానం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకుల వాదన.మరి మీనాక్షి చౌదరి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో లేదో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.ఇక అదే రోజున కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా కూడా విడుదల కానుంది.
పాన్ లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.