బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన సినిమా పై తీవ్ర విమర్శలు చేసిన కంగనా తాజాగా మరోసారి ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమా పై విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ సినిమాను ఉద్దేశించి కంగనా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం గంగూబాయి కతియావాడి.ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ… ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయి.రొమాంటిక్ కామెడీ చేసే పాప నటించగలదని అందరూ అనుకుంటున్నారు.
మూవీ మాఫియా కారణంగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై సౌత్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఆధిపత్యం పెరిగింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విజయం సాధించలేదనే ఉద్దేశంతో కంగనా ఈ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం కంగనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా మహేష్ భట్ అంటేనే ఎంతో మండిపడే కంగనారనౌత్ ప్రస్తుతం ఆయన కూతురు పై ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీ టౌన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.మరి కంగనా వ్యాఖ్యలపై ఆలియా ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.