కొన్ని వారాల క్రితం ఒక మహిళ కోసం ప్రత్యేకంగా విమానం గాల్లోకి ఎగిరింది.ఆ విమానంలో ప్రయాణించేందుకు ఆమె తప్ప మరెవ్వరు కూడా టికెట్టు కొనలేదు.
దాంతో ఆమె టికెట్ను క్యాన్సల్ చేయలేక విమానంను నడిపించడం జరిగింది.అయితే మళ్లీ అదే సంఘటన పునరావృతం అయ్యింది.
మార్చి 16వ తారీకున స్కిర్మంటాస్ అనే వ్యక్తి హాలీడే వెకేషన్ కోసం అని లిథువేనియా నుండి ఇటలీకి వెళ్లాలనుకున్నాడు.అందుకోసం బోయింగ్ 737 విమానంకు టికెట్టు కొనుగోలు చేశాడు.
విమాన ప్రయాణం రోజు అంతా సిద్దం చేసుకుని స్కిర్మంటాస్ ప్లైట్ ఎక్కాడు.
ప్టైట్ ఎక్కిన అతడు అవాక్కయ్యాడు.ఎందుకంటే అప్పటికి ప్లైట్లో ఎవరు లేరు.తన తర్వాత ఎవరైనా ఎక్కుతారేమో అనుకున్నాడు.
కాని అనూహ్యంగా ఎవరు కూడా ఎక్కలేదు.చాలా సేపటి వరకు విమానంలో ఎవరు ఎక్కక పోవడంతో పాటు విమానం ప్లైయింగ్కు సిద్దం అవుతుందనే ప్రకటన వచ్చింది.
ఎయిర్ హోస్టస్ వచ్చి వారి ఫార్మాల్టీస్ను పూర్తి చేస్తున్నారు.దాంతో అతడికి ఆ విమానంలో ప్రయాణించబోతున్నది తాను ఒక్కడినే అని అర్థం అయ్యింది.
188 మంది కెపాసిటీ ఉన్న విమానం కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం ప్లై కావడం అంటే మామూలు విషయం కాదు.సదరు విమానయాన సంస్థ నిబద్దతకు అది నిదర్శణంగా చెప్పుకోవాలి.ఒక్క వ్యక్తి కోసం విమానం ప్రయాణం అంటే చాలా లాస్.అయినా కూడా ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టవద్దనే ఉద్దేశ్యంతో విమాన ప్రయానంను కంటిన్యూ చేశారు.ఇక ఒకే ఒక్క ప్యాసింజర్గా స్కిర్మంటాస్ చాలా ఆనందం వ్యక్తం చేశాడు.నేను ఒక్కడినే విమానంలో ప్రయాణిస్తున్నాను అంటూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.