కరోనా మన నుండి ఇంకా దూరం కాలేదు.ప్రతి వారు విధిగా కరోనా రక్షణ సూత్రాలు పాటిస్తూ, తప్పని సరిగ్గా మాస్క్ పెట్టుకోండని అధికారులు ఎంత అరచినా స్పందించి, ఆచరించే వారే కరువైయ్యారు.
ఎవరు ఎంత మొత్తుకున్న మాకేం అవుతుందిలే అనే ధీమాతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
అసలు కరోనా అనే ఒక భయంకరమైన భూతం ఒక్కొక్కరికి నరకాన్ని చూపించిందన్న విషయాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు.
అందుకే మీరెవరు ఎలా ఉన్నా నాకేంటి.నాపని నేను చేసుకుంటూ వెళ్లుతా అని అవకాశం దొరికితే చాలు వ్యాపిస్తుంది.
ఇకపోతే తాజాగా కరీంనగర్ జిల్లా రూరల్ మండలం చేగుర్తిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.సుమారుగా పది రోజుల క్రితం మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబాల్లో పలువురికి వైరస్ సోకింది.ఈ క్రమంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో దాదాపుగా 28 నుండి 33 మంది వరకు కరోనా పాజిటీవ్ అని తేలిందట.అయితే వీరంతా ఇంకా ఎవరెవరిని కలిశారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారట.