బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గురించి అందరికీ తెలిసిందే.ఈమె తన వ్యక్తిగత విషయంలో చేసిన సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు బాలీవుడ్ అభిమానులు.
కానీ ఆమెకు జరిగిన ఎదురుదెబ్బ మాత్రం అంతా ఇంతా కాదు.ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈమెపై ఆయన అభిమానులు ఎంత మండిపడ్డారో తెలిసిందే.
అంతేకాకుండా ఆమెను సినిమాల్లో కూడా తీసుకోవద్దని సోషల్ మీడియా వేదికగా అభిమానులు బాగా మండిపడ్డారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ, రియా చక్రవర్తి కలిసి నటించిన సినిమా ‘చెహ్రే’.
ఇక ఈ సినిమా టీజర్ గురువారం విడుదలయింది.ఇక సోషల్ మీడియా వేదికగా టీజర్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేయగా ఇమ్రాన్ హష్మీ తన ట్విట్టర్ వేదికగా అన్నూ కపూర్ వాయిస్ తో డైలాగులు వినిపించారు.
అందులో అమితాబచ్చన్, ఇమ్రాన్ లుక్ లు కనిపించగా.ఓ డైలాగ్ ను కూడా మెసేజ్ చేశారు.ఇది చూసిన నెటిజనులు బాగా ప్రశంసలు అందించారు.ఇదిలా ఉంటే రియా చక్రవర్తి ను మాత్రం మళ్లీ అవమానించారని తెలుస్తుంది.
ఎందుకంటే ఈ టీజర్ లో ప్రముఖ పాత్రను పోషించిన రియా చక్రవర్తి కనబడలేదు.అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ క్యాంపైన్ లో కూడా ఎక్కడ కనిపించలేదు.
అంతే కాకుండా ఈ సినిమా పోస్టర్ విడుదల చేసినప్పుడు కూడా ఇందులో తను కనిపించకపోవడంతో చాలా బాధపడింది.ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం ఒక ఎత్తు.
కానీ ఉన్న అవకాశం లో తాను మిస్ అయినందున తాను భావోద్వేగానికి గురైంది.కాగా తాజాగా విడుదలైన టీజర్ లో కూడా ఆమె లేకపోవడంతో దర్శక నిర్మాతలు తనను మాయం చేశారా అని కామెంట్లు వస్తున్నాయి.