బోయపాటి సినిమా అంటే మాస్ ఊర మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి.ఇక అవే తనని బ్లాక్ బస్టర్ బోయపాటి అయ్యేలా చేశాయి.
సరైనోడుతో స్టెలిష్ స్టార్ నే సరికొత్త స్టైల్ లో చూపించి అదరగొట్టిన బోయపాటి ఆ సినిమాలో విలన్ గా చేసిన ఆది పాత్రను భలే డిజైన్ చేశాడు.హీరో ఎంత బలవంతుడో శత్రువు కూడా అంతే భలవంతుడిగా ఉండాలన్నదే బోయపాటి శ్రీను ఫార్ములా ఆ క్రమంలోనే తన విలన్స్ ను వయిలెంట్ గా ఉంచుతాడు.
ఇక వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు.తను హీరోగా చేసిన పాత్రల కన్నా విలన్ గా చేసిన సరైనోడుతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించాడు ఆది.
అయితే మరోసారి ఆదిని తన తర్వాత సినిమాలో కూడా తీసుకుంటున్నాడట బోయపాటి శ్రీను.ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనుతో సినిమా చేస్తున్న బోయపాటి, ఆ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం ఆదిని అడుగుతున్నాడట.
మరి సరైనోడు అంటే అల్లు అరవింద్ మాట కాదనలేక అల్లు అర్జున్ కోసం చేశాడు.కాని బెల్లంకొండ శ్రీను కోసం చేస్తాడా అన్నది ఆలోచించాల్సిన విషయం.అంతేకాదు సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు విక్టరీ వెంకటేష్ ను కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం చేస్తున్నాడు బోయపాటి శ్రీను.మరి ఇంతమంది క్రేజీ స్టార్స్ ఈ సినిమాలో ఉండటం ఇది ఓ మల్టీ స్టారర్ సినిమాగా చెప్పుకోవచ్చు.