పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్లో నటిస్తున్న విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రీమేక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.
ఈ చిత్రంలో పవన్ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై క్లారిటీ కూడా వచ్చింది.ఆన్ లొకేషన్స్ స్టిల్స్ లీక్ అయ్యాయి.
లాయర్ సాబ్ అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదే సమయంలో పవన్ తన తదుపరి చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో చేసేందుకు రెడీ అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందబోతున్న మూవీని ఈనెల 27వ తారీకున లాంచనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అలాంటి సమయంలో వరుసగా రెండు సినిమాలను పవన్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
అసలు ఒకేసారి రెండు సినిమాలను పవన్ ఎలా చేస్తాడు అనే అనుమానాలు కూడా మొదలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు చిత్రాల నిర్మాతల వద్ద చాలా కాలం క్రితమే పవన్ అడ్వాన్స్లు తీసుకున్నాడు.వారి అడ్వాన్స్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితి.అందుకే ఈ రెండు సినిమాలు చేసి సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమాలు స్పీడ్గా చేసి వేసవి తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితం అవ్వాలి అనేది పవన్ ఉద్దేశ్యం అయ్యి ఉంటుందని అంటున్నారు.పవన్కు మళ్లీ హీరోగా నటించే ఉద్దేశ్యం లేనట్లుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.