గతంలో వచ్చిన ‘ధోనీ’ బయోపిక్, తాజాగా మహేష్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ.ఈమె ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.
ఆ చిత్రం పేరు “లస్ట్ స్టోరీస్”.ఇందులో ఆమె బోల్డ్ క్యారెక్టర్లో నటించి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.
శృంగార కోరికలు ఎక్కువగా గల గృహిణిగా నటించిన కైరా ఓ సన్నివేశంలో వైబ్రేటర్తో స్వయంతృప్తి చేసుకుంటుంది.“ఇది పూర్తిగా పెద్దల కోసం తీసిన సినిమా.మొదట నాకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ సీన్ లేదు.షూటింగ్ సమయంలో ఈ సీన్ యాడ్ చేశారు.ఆ సీన్ చేస్తేనే సబ్జెక్ట్కు న్యాయం చేసినట్టు అవుతుందని నాకు అనిపించింది.చిత్రబృందం చాలా సహకరించింది కాబట్టే.
ఎంతో మంది మగాళ్లు ఉండగా ఆ సీన్లో నటించాను.ఆ సీన్ చేసినందుకు నేను పశ్చాత్తాపం చెందడం లేద”ని అదో కొత్త అనుభూతిగా భావిస్తున్నట్టు చెప్పింది.
ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.పడక గదిలోకి వెళ్లి వైబ్రేటర్తో స్వయంతృప్తి చేసుకోడం ప్రారంభిస్తుంది.ఇంతలో ఆమె భర్త, అత్త, వృద్ధురాలు ఇంటికి వస్తారు.
వారు పిలవగానే.
కంగారుతో ఆమె బయటకు వచ్చేస్తుంది.వైబ్రేటర్ రిమోట్ను టీవీ మీద పెట్టి.
వారికి మంచి నీళ్లు ఇవ్వడానికి వెళ్తుంది.వృద్ధురాలు టీవీ రిమోట్ అనుకుని ఆ రిమోట్ ఆన్ చేస్తుంది.
దీంతో వైబ్రేటర్ ఆన్ అవుతుంది.ఆ సమయంలో కైరా హవభావాలు చూసి ఇంట్లో వారు షాకవ్వుతారు.
అయితే, ఈ సీన్ బ్యాక్గ్రౌండ్లో భక్తి పాటను పెట్టడం వివాదస్పదంగా మారింది.
కైరా అద్వానీ సీన్ను ఎపిసోడ్కు కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు.అలాగే, ఈ సినిమాలో వచ్చే ఆపాట కూడా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘కబీ ఖుషీ కబీ ఘమ్’ సినిమాలోనిదే.వైబ్రేషన్ సీన్ వచ్చే సమయంలో టీవీలో ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ సినిమా టైటిల్ సాంగ్ వస్తుంటుంది.
ఆ పాటను ఆ సీన్కు మ్యాచ్ చేసి నవ్వు పుట్టించేలా సన్నివేశాన్ని చిత్రీకరించారు.దీనీపై ప్రముఖ గాయాని లతా మంగేష్కర్ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.