ఒక కుటుంబంలో అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే అక్కా తమ్ముళ్ళ అనుబంధాలు చాలా స్వచ్చంగా ఉంటాయి.ఈ మధ్యకాలంలో కత్తులు దూసుకుంటున్న కుటుంబ సభ్యులని చూస్తున్నాం కాని ఆత్మీయ అనుబంధాలు పెంచుకొని ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికే కుటుంబ సభ్యులు కూడా ఉంటారు.
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఇలాంటి అనుబంధాలని రుజువు చేస్తూ ఉంటాయి.తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు చనిపోవడం.
అన్న మరణించిన కొద్దిసేపటికే తమ్ముడు చనిపోవడం, తమ్ముడు మరణించిన కొద్ది రోజుల్లోనే అక్క మరణించడం జరుగుతూ ఉంటుంది.ఇలాంటి మరణాలు సహజంగా కనిపించిన వారి మధ్య అనుబంధాలని తెలియజేస్తూ ఉంటాయి.
ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు విషయంలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది.
ఎస్.
పి.జననాథన్ ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన విషయం తెలిసిందే.కొన్ని రోజులపాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 14వ తేదీన తుదిశ్వాస విడిచారు.ఆయన చనిపోయిన మూడో రోజునే మరో విషాదం చోటు చేసుకుంది.
ఆయన సోదరి లక్ష్మీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.సోదరుడు జననాథన్ అంత్యక్రియల్లో కూడా ఆమె పాల్గొన్నారు.
అయితే.సోదరుడి మృతిని తట్టుకోలేక ఆమె గుండెలవిసేలా రోదించారు.
ఈ ఆవేదనతోనే ఆమె గుండెపోటుతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.దీంతో వారి కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.
సోదరుడు మరణంతో పాటే ఆమె కూడా ప్రాణాలు విడవడం చూస్తుంటే వారిమధ్య ఎంత అనుబంధం ఉంది అనేది తెలుస్తుంది.ఇదిలా ఉంటే జన నాథన్ ఇటీవల విజయ్ సేతుపతితో లాభం అనే సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.