పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలు కూడా చూసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు.ఎప్పుడూ లేనంత వేగంగా సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.
ఎలెక్షన్లకు ఇంకా చాలా సమయం ఉండడం వల్ల ఈ లోపు ఎన్ని సినిమాలు వీలైతే అన్ని చెయ్యాలని పవన్ కళ్యాణ్ వేగం పెంచుతున్నాడు.వకీల్ షబ్ చిత్రం ఈ మధ్యనే పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసాడు.
ప్రస్తుతం సాగర్ కె దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ ఆయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుపాటి కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన సాయి పల్లవి, రానా పక్కన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా నుండి సాయి పల్లవి తప్పుకుందని మనందరికీ తెలిసిన విషయమే.కొన్ని కారణాల వల్ల సాయి పల్లవి ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందట.
అయితే తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు టాక్.
అయితే మర్చి నెలలో బిజీగా ఉండడం వల్ల కాల్షీట్లు సర్దుబాటు చెయ్యలేక ఈ సినిమా నుండి సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ తప్పుకున్నట్లు తెలుస్తుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుబాటు కాక ఇష్టంలేక పోయిన ఈ సినిమా నుండి ఈ ఇద్దరు భామలు తప్పుకున్నారట.మళ్ళీ చిత్ర యూనిట్ హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారట.
ఈ సినిమా కోసం పవన్ కేవలం 40 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట.
ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.దీనితో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడట.
ఈ సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.