సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభం అయ్యి మద్యలో నిలిచి పోయిన విషయం తెల్సిందే.ఆ సినిమా ప్రారంభం అయ్యింది మొదలు ఏదో ఒక వివాదం వల్ల ఆగుతూనే వచ్చింది.
చివరకు సినిమా షూటింగ్ సందర్బంగా క్రేన్ యాక్సిడెంట్ అవ్వడంతో షూటింగ్ నిలిచి పోయింది.మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు గాను ప్రయత్నాలు జరిగినా కూడా అవి సఫలం అవ్వలేదు.
ఈ లోపు కరోనా వచ్చింది.దాంతో మొత్తం షూటింగ్ లు ఆగిపోయాయి.
కరోనా సమయంలో రామ్ చరణ్ తో సినిమా కు శంకర్ ఫిక్స్ అయ్యాడు.ఇండియన్ 2 పూర్తి అవ్వకుండా చరణ్ తో సినిమా చేయడానికి వీలు లేదు అంటూ లైకా వారు కోర్టును ఆశ్రయించారు.
దాంతో కోర్టు మద్యవర్తులతో ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిందిగా సూచించింది.
కోర్టు సూచించినట్లుగా మద్యవర్తులతో లైకా మరియు శంకర్ ల మద్య ఒప్పందం కుదిరింది.
శంకర్ ఇండియన్ 2 ను ముగించేందుకు ఓకే చెప్పాడు.దాదాపుగా సగం వరకు షూటింగ్ పూర్తి అయిన ఇండియన్ 2 కోసం నాలుగు నెలల సమయం కేటాయిస్తాను అంటూ శంకర్ హామీ ఇచ్చాడట.
ఆ సమయంలో ఇతర నటీ నటుల డేట్లను తీసుకోవాల్సిన బాధ్యత లైకా వారికి ఇచ్చాడు.దాంతో ఇప్పుడు హడావుడిగా లైకా వారు ఆ పనుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమా రెండవ షెడ్యూల్ ను శంకర్ చేస్తున్నాడు.ఆ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే ఇండియన్ 2 కు వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి.కాని అసలు విషయం ఏంటీ అంటే చరణ్ మూవీ పూర్తి చేయకుండా ఇండియన్ 2 ను శంకర్ మొదలు పెట్టకూడదు.అది దిల్ రాజుతో శంకర్ చేసుకున్న ఒప్పందం.
కనుక సమ్మర్ వరకు సినిమా ను ముగించి దిల్ రాజు చేతిలో పెట్టి ఆ తర్వాత ఇండియన్ 2 ను శంకర్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.