మెగా ఫ్యామిలీలో ఇప్పటికే నాగబాబుకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.ఆయన కరోనాను జయించి నెలలు గడుస్తుంది.
ఇక ఆ ఫ్యామిలీకి కరోనా భయం లేదు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని ఆమద్య వార్తలు వచ్చాయి.అయితే రిపోర్ట్ తప్పుగా వచ్చిందని అందుకే కరోనా పాజిటివ్ అంటూ వచ్చింది.
అసలు కరోనా అనేది చిరంజీవికి లేదు అంటూ ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.ఇక కొన్ని వారాల తర్వాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
చరణ్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన కొన్ని గంటల్లోనే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.నాతో ఇటీవల కలిసి ప్రతి ఒక్కరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోండి.స్వల్పంగా లక్షణాలు ఉండటంతో అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా నాకు పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
అందుకే నాతో కలిసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండండి అంటూ వరుణ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.ఇటీవల ఆయన బాక్సర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.
వచ్చే నెల ఆరంభం నుండి ఈయన ఎఫ్ 3 సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది.ఇలాంటి సమయంలో ఇలా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో కుటుంబ సభ్యులు మరియు మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ అంటూ చరణ్ కూడా ఉండటంతో ఇద్దరు కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారు.వీరి నుండి మరెవ్వరికైనా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది.