ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఇండస్ట్రీకి చిరంజీవినే మూడో కన్ను.. వెంకయ్య నాయుడు కామెంట్స్ వైరల్?

రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ మెగా స్టార్ గా నిలిచిన చిరంజీవి గురించి తెలియని ప్రేక్షకులే లేరు.ఎన్నో సినిమాలలో నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు.

 After Anr And Ntr Chiranjeevi Is The Third Eye Of Industry Says Vankaiah Naidu D-TeluguStop.com

వ్యక్తిగతంగా ఎంతోమంది హృదయాలలో నిలిచాడు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి గురించి వెంకయ్య నాయుడు కొన్ని కామెంట్స్ చేశాడు.

చిరంజీవి నటుడుగానే కాకుండా ఒకప్పుడు రాజకీయవేత్తగా బాధ్యతలు చేపట్టాడు.

సొంతంగా ప్రజారాజ్యం పార్టీ చేపట్టాడు.కానీ ఆయన రాజకీయ పాత్ర ఎక్కువ కాలం నిలువలేకపోయింది.

ఆ సమయంలో రాజకీయం పై ఆసక్తి ఉండటంతో సినిమాలకు కూడా దూరమయ్యాడు.కానీ తనకు రాజకీయంలో అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి అభిమానుల కోసం రీఎంట్రీ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటూ యంగ్ హీరోలకు పోటీగా దూసుకెళ్తున్నాడు.ఈయన వ్యక్తిగతంగా ఎంతో మందికి ఆర్థికంగా సహాయం చేశాడు.అంతేకాకుండా సొంతంగా బ్లడ్ బ్యాంకును కూడా స్థాపించాడు.ఇక కరోనా సమయంలో కూడా ఎంతో మంది బాధితులకు సహాయం చేశాడు.

ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నటీనటులకు కూడా సహాయం చేశాడు.

Telugu Chiranjeevi, Heroes, Talasani, Moha Babu, Sr Naresh, Tollywood, Venkaiah,

అలా ఇప్పటివరకు చిరంజీవి ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు.ఇక ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి పేరు బాగా వినిపిస్తుంది.అది కూడా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి ఉంటేనే బాగుంటుంది అని కొందరు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా అంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో దాసరి నారాయణ పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే.

కానీ ఈయన తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా ఉండేది ఎవరు అని బాగా ప్రశ్నలు ఎదురవడంతో చాలా మంది చిరంజీవి పేరునే వినిపిస్తున్నారు.

ఎందుకంటే చిరంజీవి ఇండస్ట్రీకు ఎంతో సహాయం చేసాడు.ఇప్పటికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తాడు.

గతంలో సీనియర్ నటులు మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి చాలా మంది సీనియర్ నటులు దాసరి నారాయణ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి అని చాలాసార్లు తెలిపారు.

Telugu Chiranjeevi, Heroes, Talasani, Moha Babu, Sr Naresh, Tollywood, Venkaiah,

కానీ కొందరు చిరంజీవికి వ్యతిరేకంగా ఉన్నారు.అందులో సీనియర్ నటుడు నరేష్ అనే చెప్పాలి.ఇటీవలే పూర్తయిన మా ఎలక్షన్ లో మోహన్ బాబు ను ఉద్దేశించి మాట్లాడాడు.

ఆయనకే తమ సమస్యలు చెప్పుకుంటామని నేరుగా తెలిపాడు.దీంతో ప్రస్తుతం ఈ పెద్ద దిక్కు పోటీ కోసం చిరంజీవి, మోహన్ బాబులలో ఎవరు అనేది ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ విషయం గురించి అటు చిరంజీవి కానీ ఇటు మోహన్ బాబు కానీ స్పందించకపోగా ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇక తాజాగా దేశ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చిరంజీవి గురించి కొన్ని ఓపెన్ కామెంట్స్ చేశాడు.

ఈయన ఇటీవలే యోధ డయాగ్నటిస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Telugu Chiranjeevi, Heroes, Talasani, Moha Babu, Sr Naresh, Tollywood, Venkaiah,

ఇక ఈ వేడుకలో తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావ్, ద్రోణవల్లి హారిక, చిరంజీవి, అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ వంటి ప్రముఖులు హాజర్ అవ్వగా ఇందులో వెంకయ్యనాయుడు కొన్ని విషయాలు పంచుకున్నాడు.సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కన్నులు అయితే ఆ తర్వాత పది కాలాల పాటు గుర్తుపెట్టుకునే నటుడుగా చిరంజీవి ఉన్నాడని ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడని తెలిపారు.ఇక ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పాను అనేసరికి చిరంజీవి చిరునవ్వుతో దండం పెడుతూ స్పందించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube