బాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలో నటించడానికి ముందు వరుసలో ఉండే హీరో రాజ్ కుమార్ రావ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని గతేడాది నవంబర్ 15న పత్ర లేఖను ఎంతో అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇదిలా ఉండగా తాజాగా హీరో తన భార్యతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి భారీ గా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.
దీంతో ఈ హీరో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేశారు.
ఇలా నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు రావడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… మిర్రర్ సెల్ఫీలో పత్ర లేఖ తెలుపు రంగు డ్రెస్ ధరించి నలుపు షూస్ ధరించి ఉంది.అదేవిధంగా రాజ్ కుమార్ రావ్ ఎరుపు నలుపు చెక్స్ ధరించి సెల్ఫీకి ఫోజులిచ్చారు.
అయితే ఈ ఫోటోలో ఆయన భార్య కూర్చున్న విధానం సరిగా లేకపోవడంతో పెద్దఎత్తున నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటో పై నెటిజన్ స్పందిస్తూ నేను నిజంగానే ఎంతో కన్ఫ్యూజన్ అయ్యాను.ఇలాంటి పరిస్థితులను నేనొక్కడినే ఎదుర్కొంటున్నాను అంటూ ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్ చేశారు.అదేవిధంగా మరొక నెటిజన్ ఈ ఫోటోని అర్థం చేసుకునే సరికి నా మైండ్ బ్లాక్ అయింది అంటూ ఈ ఫోటోపై కామెంట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.
అయితే ఈ ఫోటో గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లు చూసిన హీరో వెంటనే ఈ ఫోటోని డిలీట్ చేశారు.అయితే అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.