వెంకటేష్, వరుణ్ తేజ్లు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ తీయాలని అనీల్ రావిపూడి, నిర్మించాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్లుగానే ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల అయిన వెంటనే అనీల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్పై దృష్టి పెట్టాడు.లాక్డౌన్లోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది అంటూ ప్రకటించాడు.
వచ్చే ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని అనుకుంటున్న సమయంలో ఎఫ్ 3 చిత్రం కంటే ముందు వెంకటేష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ప్రస్తుతం శేఖర్ కమ్ముల అందుకు సంబంధించిన స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు అనేది వార్తల సారాంశం.
ఈ విషయంలో సినీ వర్గాల ద్వారా క్లారిటీ వచ్చింది.అనీల్ రావిపూడి ఈ విషయంలో సన్నిహితుల వద్ద మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
అనీల్ రావిపూడి తాజాగా సన్నిహితుల వద్ద మాట్లాడుతూ వెంకటేష్ నారప్ప చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎఫ్ 3 చిత్రం మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన డైలాగ్ వర్షన్ను రాస్తున్నట్లుగా పేర్కొన్నాడు.వచ్చే ఏడాది ఆరంభంలో ఎఫ్ 3 ని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఆ తర్వాత సమ్మర్లో శేఖర్ కమ్ముల వెంకీ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.