మనం తర్వాత మరో మల్టీస్టారర్‌... ఈసారి బంగార్రాజుగా చైతూ?

అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కలిసి నటించిన ‘మనం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.

 After Manam Nagarjuna And Naga Chaitanya Maltistarrer-TeluguStop.com

అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న మనం చిత్రం తర్వాత మళ్లీ అక్కినేని వారి మల్టీస్టారర్‌ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు మల్టీస్టారర్‌ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అక్కినేని హీరోల్లో ఏయన్నార్‌ లేకపోవడంతో కనీసం తండ్రి, కొడుకులతో అయినా మూవీ రావాలని అక్కినేని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.

ఆ కోరిక త్వరలోనే తీరే అవకాశం ఉందని అనిపిస్తుంది.నాగార్జున మరియు నాగచైతన్యలు కలిసి ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా సమాచాం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట.

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీలోని బంగార్రాజు పాత్రను తీసుకుని ఒక చిత్రం మలిచేందుకు దర్శకుడు చాలా రోజుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బంగార్రాజు మూవీ స్టోరీ రెడీ అయ్యింది.

బంగార్రాజు కథ ఇద్దరు హీరోలను డిమాండ్‌ చేస్తుందంట.అందుకే ఈ చిత్రం కోసం నాగార్జునతో పాటు నాగ చైతన్యను కూడా ఎంపిక చేయాలని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ నిర్ణయించుకున్నాడు.నాగార్జున కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.భారీ ఎత్తున రూపొందబోతున్న ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ ఎంపిక అయ్యింది.నాగచైతన్య సరసన సమంత లేదంటే మరో హీరోయిన్‌ ఎవరైనా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube