గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ పరశురాం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.మహేష్ స్టార్ డం కు ఏమాత్రం తగ్గకుండా పరశురాం కథ కథనాలు ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.
ఈమధ్యనే వచ్చిన సర్కారు వారి పాట టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.ఇక సర్కారు వారి పాట తర్వాత పరశురాం అక్కినేని హీరోతో సినిమా చేస్తాడని టాక్.
గీతా గోవిందం తర్వాత అసలైతే నాగ చైతన్య హీరోగా పరశురాం డైరక్షన్ లో సినిమా రావాల్సి ఉంది.కాని ఆ సినిమా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.
అయితే మహేష్ సర్కారు వారి పాట తర్వాత ఎలాగు పరశురాం కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరుతాడు కాబట్టి అతని డైరక్షన్ లో సినిమాకు లైన్ క్లియర్ చేస్తున్నాడట నాగ చైతన్య.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని అంటున్నారు.
మహేష్ తర్వాత నాగ చైతన్యతో పరశురాం మూవీ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు.ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ములతో చేసిన లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీ అవుతుండగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న థ్యాంక్ యు మూవీ సెట్స్ మీద ఉంది.