మంచు విష్ణు తాజాగా మోసగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా రిలీజ్ తరువాత విష్ణు రిజల్ట్ తెలిసి ఇంకేం మాట్లాడలేదు.శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
ఢీ అండ్ ఢీ టైటిల్ తో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది.ఢీ సీక్వెల్ గా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్న రెండు కథలు వేర్వేరని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
ఆ సినిమాకి మించిన ఫన్ అండ్ యాక్షన్ ఈ సినిమాలో ఉండబోతుంది అని చెప్పారు.ఇక ఈ సినిమాని కూడా విష్ణునే నిర్మిస్తున్నాడు.
అయితే ఈ సారి సినిమా బడ్జెట్ విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాలని విష్ణు అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఢీ సీక్వెల్ తర్వాత మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ విషయాన్ని తాజాగా తెలియజేశాడు.
మోసగాళ్లు సినిమా మంచి టాక్ తో రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రస్తుతం శ్రీను వైట్లతో చేస్తున్న డీ అండ్ డీ తరువాత నా డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్పప్ప చేస్తాను.దీనికి దేవుడి దయతో అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాను.
కథ కూడా ఇప్పటికే రెడీ అయ్యి ఉంది.భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాం అని విష్ణు క్లారిటీ ఇచ్చారు.
అయితే మోసగాళ్ళు సినిమాకి భారీగా పెట్టుబడి పెట్టి దెబ్బతిన్న కూడా విష్ణు భక్త కన్నప్ప విషయంలో ధైర్యంగా అడుగు వేయడం గొప్ప విషయం అని చెప్పాలి.