‘ధోనీ’ బయోపిక్ తో పరిచయమయ్యి, మహేష్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా వినయ విధేయ రామాలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.
కైరా తెలుగులో నటించిన రెండు సినిమాలు గమనిస్తే…రెండిటికి ఈ రెండు చిత్రాలు కూడా టాలీవుడ్లో బడా నిర్మాత డీవీవీ దానయ్యవే కావడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా…కైరకి ఆఫర్లు దండిగానే వస్తున్నాయి…కానీ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేసరికే నిర్మాతలు వెనక్కితిరుగుతున్నారు.ఇటీవల హీరో గోపిచంద్ తదుపరి చిత్రంలో కియారాను నటింపజేసేందుకు సదరు నిర్మాతలు సంప్రదింపులు జరిపారట.
అయితే వారు కైరా చెప్పిన రెమ్యూనరేషన్ కి షాక్ అవ్వాల్సి వచ్చింది.
గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం కియారా సుమారు రూ.1 కోటికిపైగానే రెమ్యునరేషన్ అడిగిందంట.దాంతో మరోమాట మాట్లాడకుండా నిర్మాతలు వచ్చేశారట.
ఇంకో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారట.